

పెళ్లి తర్వాత సినిమాలు కొంత తగ్గించిన యంగ్ హీరోయిన్ అదితి రావు హైదరి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్లో జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటున్నారు. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తున్నప్పటికీ ఆశించిన విజయాలు రాకపోయినా, ఆమె నిరాశ చెందకుండా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇటీవల ‘గాంధీ టాక్స్’ సినిమాలో కనిపించిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో భారతీయ సినిమాల్లో మహిళల పాత్రల మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమాల్లో మహిళా పాత్రలకు దక్కుతున్న ప్రాధాన్యత మెల్లమెల్లగా మారుతోందని అదితి తెలిపారు. అయితే ఈ మార్పు ఆటోమేటిక్గా జరగదని, నటీనటులు, దర్శకులు మంచి కథలను ప్రోత్సహించినప్పుడే ఇది సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. మహిళా పాత్రలు కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా గౌరవం, ప్రత్యేకత ఉండాలని సూచించారు. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలను రిస్క్గా చూస్తున్నప్పటికీ ఆ రిస్క్ తీసుకోవడం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!