

మాస్ మహారాజా రవితేజ తాజాగా ‘ఇరుముడి’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్లో తన తదుపరి సినిమాను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ ఎంటర్టైనర్కు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రవితేజకు జోడీగా ఐశ్వర్య రాజేష్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఆమె సెప్టెంబర్ నుంచి చిత్రీకరణలో పాల్గొంటుందని సమాచారం. మరోవైపు శ్రీవిష్ణుకు జోడీగా మాళవికా మోహనన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత ఉండనుందని టాక్ వినిపిస్తోంది.
‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ చిత్రాల తర్వాత హసిత్ గోలి తెరకెక్కిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ షూటింగ్ సెప్టెంబర్లో ప్రారంభం కానుంది. సినిమా చిత్రీకరణను వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. కేవలం నాలుగున్నర నెలల్లోనే మొత్తం షూటింగ్ను ముగించి, 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. రవితేజ, శ్రీవిష్ణు కలయికలో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. దీనికి తోడు హసిత్ గోలి దర్శకత్వం వహిస్తుండటం అంచనాలను మరింత పెంచుతోంది. హీరోయిన్లతో పాటు ఇతర నటీనటుల ఎంపికపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్పై అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!