
గాసిప్స్

కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శలు చేశారు. తమ శాఖలకు సంబంధించిన పనులకు నిధులు మంజూరు చేసే అధికారం మంత్రులకు లేదని ఆయన ఆరోపించారు. నిధుల సాంక్షన్ కోసం ఆర్థిక శాఖ మంత్రి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
ఈ విధానం కారణంగా అభివృద్ధి పనులు సకాలంలో ముందుకు సాగడం లేదని కూనంనేని విమర్శించారు. నిధుల మంజూరులో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు సైతం పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!