

భారత స్టార్ క్రికెటర్ 'హిట్మ్యాన్' రోహిత్ శర్మ సరికొత్త అవతారంలో అలరించనున్నాడు. క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించిన అతడు, ఇప్పుడు వినోద రంగంలోకి అడుగుపెడుతున్నాడు. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా రూపొందిస్తున్న 'ఫ్యామిలీ ఫుల్ హౌస్' అనే సరికొత్త షోకు రోహిత్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ కార్యక్రమం 2026 సెప్టెంబర్ 19వ తేదీ నుండి సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ ఛానెల్తో పాటు సోనీ లివ్ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని సోమవారం ప్రకటించారు.
సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ తమ పండుగ సీజన్ కంటెంట్ లైనప్లో భాగంగా ఈ షోను ప్రకటించింది. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్పతి' నూతన సీజన్, అజయ్ దేవగణ్ వ్యాఖ్యాతగా వస్తున్న 'క్రైమ్ పెట్రోల్ 2026', హన్సల్ మెహతా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్కామ్ 2010' వంటి భారీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటి సరసన రోహిత్ శర్మ షో కూడా చేరడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!