
సినిమాలు

అఫ్ఘానిస్థాన్తో జరగనున్న టీ20 సిరీస్కు ముందు భారత జట్టుకు శుభవార్త అందుతోంది. గాయాల కారణంగా పునరావాస శిబిరంలో ఉన్న హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ కోలుకుంటున్నట్లు సమాచారం. జట్టు ఎంపిక కోసం జాతీయ సెలెక్టర్లు ఈ వారంలో సమావేశం కానుండగా, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి పేర్లను ఎంపికలో పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
హార్దిక్ పాండ్యా తన పునరావాస కార్యక్రమం కోసం ముంబై నుంచి బెంగళూరుకు మకాం మార్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలో ఉన్న వాషింగ్టన్ సుందర్ కూడా జట్టు ఎంపికకు ముందే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఫిట్నెస్ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తే అఫ్ఘానిస్థాన్తో టీ20 సిరీస్కు భారత జట్టుకు మరింత బలం చేకూరనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!