
సినిమాలు

భారీ విజయాన్ని అందుకున్న డిమాంటి కాలనీ ఫ్రాంచైజీలో వస్తున్న తాజా చిత్రం ‘డిమాంటి కాలనీ 3’ విడుదలకు సిద్ధమవుతోంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధన్ సుందరం, మనీష్ సింఘాల్, దుర్గా రామ్ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ది ఎండ్ ఈజ్ టూ ఫార్ అవే’ అనే ట్యాగ్లైన్తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్, అరుళ్నిధి, గురు సోమసుందరం, కదిర్, ఆషిక్ హుస్సేన్, అర్చన రవిచంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు ప్రేక్షకులను భయపెట్టి భారీ విజయాలను అందుకోవడంతో మూడో భాగంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ద్వారా ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో హారర్ మూవీ అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!