

తమిళ స్టార్ హీరో విశాల్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఓ కార్యక్రమంలో విశాల్ మాట్లాడుతూ, విజయ్ను కలిసినప్పుడు ముఖ్యమంత్రిని కలుస్తున్న భావన కలగలేదని, ఎంతో ఆప్యాయంగా “డార్లింగ్” అని పిలుస్తానని తెలిపారు. గతంలో విజయ్ కోసం చెప్పిన కథను గుర్తు చేసుకుంటూ, ఆయన ఇక సినిమాల్లో నటించడం లేదని, ఆ కథతో తానే సినిమా తెరకెక్కిస్తానని వెల్లడించారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న రెట్టింపు పన్ను సమస్యపై కూడా సీఎం విజయ్ దృష్టి సారిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజ్మోహన్పై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని విశాల్ స్పష్టం చేశారు. ఆయనను తక్కువ చేసి మాట్లాడలేదని, అనవసరంగా కుల అంశాన్ని ఇందులోకి తీసుకువస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. విజయ్కు 32 ఏళ్ల సినీ అనుభవం ఉండటంతో పరిశ్రమ సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ఇక విశాల్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘మగుడం’ చిత్రం తెలుగులో ‘మకుటం’ పేరుతో ఆగస్టు 14న విడుదల కానుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!