
జనరల్

తాజాగా విడుదలైన ‘పెద్ది’ సినిమాలో ‘అప్పలసూరి’ పాత్రలో తన నటనకు ప్రశంసలు అందుకుంటున్న సీనియర్ నటుడు జగపతి బాబు మీడియాతో మాట్లాడారు. జాన్వీ కపూర్ పాత్రపై వస్తున్న విమర్శల గురించి స్పందిస్తూ, ఒక ప్రాజెక్ట్లో నటించిన తర్వాత దర్శకుడు చెప్పిన విధంగా నటించాల్సిన బాధ్యత నటీనటులదేనని తెలిపారు. ప్రతి సారి అన్ని సన్నివేశాలు వర్కౌట్ కావని, కానీ దానికి నటులను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు.
అలాగే తన నిజ జీవితంపై మాట్లాడిన ఆయన, నిజాయితీతో జీవించడం సాధ్యమేనని చెప్పారు. “నేను జీవితంలో అబద్ధం చెప్పలేదు” అని ఎవరైనా చెబితే అదే పెద్ద అబద్ధమని వ్యాఖ్యానించారు. అంతేకాదు, సోషల్ మీడియాలో తన మరణంపై వచ్చిన తప్పుడు వార్తలను కూడా ప్రస్తావిస్తూ, అలాంటి రూమర్లను తాను పట్టించుకోనని, నిజాయితీగా జీవించడం తన స్టైల్ అని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!