

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం షూటింగ్కు తాత్కాలికంగా విరామం ఏర్పడింది. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్కు చిన్నపాటి గాయం కావడంతో చిత్రీకరణను నిలిపివేసినట్టు సమాచారం. అయితే అభిమానుల్లో నెలకొన్న సందేహాలకు మైత్రి మూవీ మేకర్స్ తాజాగా స్పష్టత ఇచ్చారు. మరో రెండు వారాల్లో ‘డ్రాగన్’ షూటింగ్ను తిరిగి ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, మొత్తం చిత్రీకరణను ఫిబ్రవరికి పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. సినిమా విడుదల విషయంలో కూడా ముందుగా నిర్ణయించిన సమయానికే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు స్పష్టం చేశారు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కావడంతో ‘డ్రాగన్’పై మొదటి నుంచే విపరీతమైన ఆసక్తి నెలకొంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్కు పెద్దపీట వేస్తున్నట్టు ఇప్పటికే వచ్చిన సమాచారం చెబుతోంది. ఎన్టీఆర్కు గాయం కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో అభిమానుల్లో కొంత ఆందోళన ఏర్పడింది. అయితే మేకర్స్ ఇచ్చిన తాజా సమాచారం ఆ సందేహాలకు తెరదించింది. నిర్ణయించిన ప్రకారం రెండు వారాల్లో చిత్రీకరణ మొదలుపెట్టి, వేగంగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. రవి బసృర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్, అనీల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ పునఃప్రారంభం, విడుదల తేదీ విషయంలో మేకర్స్ ఇచ్చిన స్పష్టతతో అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం పెరిగింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!