

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక, హైదరాబాద్ ప్రాంతాల్లో పలు కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న చిత్రబృందం ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో తదుపరి చిత్రీకరణను కొనసాగిస్తోంది. ఈ షెడ్యూల్లో కథకు ప్రధాన బలంగా నిలిచే కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఎన్టీఆర్, హీరోయిన్ రుక్మిణి వసంత్లపై భారీ స్థాయిలో నైట్ షెడ్యూల్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామాను 2027 జూన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది ముగిసేలోపు మొత్తం షూటింగ్ను పూర్తి చేయాలనే లక్ష్యంతో తారక్ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ‘డ్రాగన్’ అనంతరం 2027లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మైథాలజికల్ డ్రామా కోసం ఎన్టీఆర్ సిద్ధమవుతారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!