

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా విడుదలకు కేవలం 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ప్రమోషన్స్ ప్రారంభం కాలేదు. అయితే దీనికి ప్రత్యేక కారణం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా సోషల్ మీడియా మరియు సినీ వర్గాల్లో ప్రధాన చర్చగా మారడంతో, ‘మా ఇంటి బంగారం’ బృందం ప్రచార కార్యక్రమాలను ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేసినట్లు సమాచారం.
ఇప్పుడు ‘పెద్ది’ విడుదలై థియేట్రికల్ రన్లో కొనసాగుతున్న నేపథ్యంలో ‘మా ఇంటి బంగారం’పై దృష్టి సారించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. జూన్ 8 నుంచి సినిమా ప్రమోషన్స్ను భారీ స్థాయిలో ప్రారంభించి విడుదల వరకు దూకుడుగా కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్, దాదాపు మూడు సంవత్సరాల తర్వాత సమంత లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!