

చెన్నైలోని ఎం.జి.ఆర్. ప్రభుత్వ చలనచిత్ర, టెలివిజన్ శిక్షణ సంస్థ ఛైర్మన్గా ప్రముఖ ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస నియామకం కావడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆయన మనోజ్ పరమహంసకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
తెలుగు, తమిళ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన మనోజ్ పరమహంసకు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, సినిమా నిర్మాణ విధానాలు, చిత్ర రూపకల్పనపై విశేష అవగాహన ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన సినీ రంగంలో ప్రతిభావంతుడైన సాంకేతిక నిపుణుడని కొనియాడారు.
ఈ విద్యాసంస్థ నుంచి చిరంజీవి, రజనీకాంత్, సుహాసిని, నాజర్, రాజేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖ నటులతో పాటు పి.సి. శ్రీరామ్, పి.ఎస్. నివాస్ వంటి సాంకేతిక నిపుణులు వెలుగులోకి వచ్చారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. మనోజ్ పరమహంస నాయకత్వంలో మరెందరో ప్రతిభావంతులు వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!