

నాలుగేళ్ల విరామం తర్వాత టాలెంటెడ్ హీరోయిన్ ప్రీతి అస్రాని టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ‘మళ్లీ రావా’ సినిమాతో కుర్రకారును ఆకట్టుకున్న ఆమె ఆ తర్వాత ‘ప్రెజర్ కుక్కర్’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘యశోద’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ వంటి విభిన్న చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళంలో ఎస్.జే. సూర్య సరసన ‘కిల్లర్’ చిత్రంలో నటిస్తున్న ప్రీతి ఇప్పుడు సంతోష్ శోభన్కు జోడీగా ‘సత్తిబాబు పరలోక యాత్ర’లో కనిపించనుంది. సరికొత్త కథాంశంతో సైన్స్ ఫిక్షన్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేయడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. యూవీ క్రియేషన్స్, ఏఆర్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘స్వాతిముత్యం’తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మణ్ కే. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మానస చౌదరితో పాటు వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్తోనే ఆసక్తిని పెంచిన ఈ చిత్రాన్ని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!