

బాలీవుడ్ నటి ప్రీతి జింటా పెళ్లి, పిల్లల తర్వాత సినిమాలకు దూరంగా ఉండి కుటుంబ జీవితానికే ప్రాధాన్యత ఇచ్చారు. ‘భయ్యాజీ సూపర్ హిట్’ తర్వాత ఎనిమిదేళ్ల విరామం అనంతరం ఆమె రాజ్కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బట్వారా 1947’ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడిన ఆమె, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం మొదట్లో కాస్త భయంగా, టెన్షన్గా అనిపించిందని తెలిపారు.
షూటింగ్ తొలి రోజే దర్శకుడు అత్యంత క్లిష్టమైన సన్నివేశాన్ని చిత్రీకరించారని, ఆ సమయంలో సన్నీ డియోల్ తనకు ధైర్యం చెప్పి ఎంతో సపోర్ట్ చేశారని ప్రీతి జింటా వెల్లడించారు. ఎనిమిదేళ్లుగా నటనకు దూరంగా ఉన్నప్పటికీ కెమెరాను ఎప్పుడూ మిస్ కాలేదని, తన పిల్లలతో గడిపిన సమయమే జీవితంలో గొప్ప మైలురాయని చెప్పారు. 1947 దేశ విభజన నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆమె ముస్లిం మహిళ పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!