
రాజకీయాలు

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్’ సెప్టెంబరు 11న థియేటర్లలో విడుదలైంది. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామాపై తాజాగా స్టార్ హీరోయిన్ రష్మిక స్పందించారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా సినిమా గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్న ఆమె, ప్రేక్షకులంతా ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూడాలని కోరారు.
ఆనంద్, ఆదిత్య, వైష్ణవి కలిసి భిన్నమైన, ముఖ్యమైన, ప్రస్తుత సమాజానికి అవసరమైన అంశాలను సినిమాలో చూపించారని రష్మిక ప్రశంసించారు. అదే సమయంలో వినోదానికి కూడా ఎలాంటి లోటు లేకుండా చిత్రాన్ని రూపొందించారని మెచ్చుకున్నారు. చిత్ర బృందాన్ని చూసి ఎంతో గర్వంగా ఉందని చెబుతూ, వారికి తన శుభాకాంక్షలు తెలిపారు. రష్మిక ప్రశంసలతో ‘ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్’పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!