

వినాయక చవితి పండుగ దగ్గర పడుతుండటంతో దేశవ్యాప్తంగా రైలు ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)లో కొత్త బుకింగ్ రికార్డు నమోదైంది. సెప్టెంబర్ 7న ఒక్కరోజులో 20,06,353 టికెట్లు బుక్ అయ్యాయి. దీంతో ఐఆర్సీటీసీ చరిత్రలో తొలిసారిగా రోజువారీ బుకింగ్స్ 20 లక్షల మార్క్ను దాటాయి.
సెప్టెంబర్ 8న కూడా బుకింగ్స్ భారీగా కొనసాగాయి. ఆ రోజు 19,50,699 టికెట్లు బుక్ అయ్యాయి. గత ఏడాది పండుగ సీజన్లో ఒక్కరోజులో అత్యధికంగా 18,40,203 టికెట్లు బుక్ కాగా, ఈసారి ఆ సంఖ్యతో పోలిస్తే సుమారు 6 శాతం ఎక్కువగా నమోదైంది. ప్రస్తుతం రిజర్వేషన్ టికెట్లలో దాదాపు 89 శాతం ఆన్లైన్లోనే బుక్ అవుతున్నాయని ఐఆర్సీటీసీ తెలిపింది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కొత్త సర్వర్లను ఏర్పాటు చేయడంతో ఆన్లైన్ బుకింగ్ సామర్థ్యం దాదాపు రెట్టింపు అయిందని వెల్లడించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!