
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్లో నేతన్న భరోసా పెన్షన్ పథకం కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలకు ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. ఇకపై పెన్షన్ దరఖాస్తుతో పాటు బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ సమర్పించాల్సిన అవసరం లేదని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. బ్యాంకు స్టేట్మెంట్కు బదులుగా మాస్టర్ వీవర్ ధ్రువీకరణ పత్రంతో పాటు వేతన వివరాలు సమర్పిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు.
ఈ నిబంధన సడలింపుతో అర్హత ఉన్న నేతన్నలు దరఖాస్తు ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గుతాయని మంత్రి తెలిపారు. 50 ఏళ్లు నిండిన అర్హులైన నేతన్నలందరికీ పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. నేతన్నల సంక్షేమం, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, వారికి ఆర్థికంగా మేలు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!