

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తన భర్త విజయ్ దేవరకొండ చేతిని పట్టుకున్న ఫొటోతో పాటు, తన స్మైలీ ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. షూటింగ్లో గాయపడటంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమైన రష్మిక.. తన ఆరోగ్యం బాగానే ఉందని అభిమానులకు తెలియజేసేలా ఈ పోస్ట్ చేశారు. సాధారణంగా ఎంతో బిజీగా ఉండే తన జీవితం ఒక్కసారిగా నెమ్మదిస్తే భయంకరంగా అనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు.
అయితే, అలాంటి సమయంలో పిచ్చిగా పరిగెత్తడం కూడా ఇబ్బందికరమేనని రష్మిక అన్నారు. ప్రేమించే మనుషుల మధ్య సమయం గడపడం అద్భుతంగా ఉంటుందని ఆమె తెలిపారు. మైసా షూటింగ్లో హై ఎనర్జీ డ్యాన్స్ సీక్వెన్స్ చేస్తుండగా రష్మిక కుడి తొడ భాగంలో గాయమైంది. దీంతో వైద్యులు సుమారు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!