

బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్ నటుడు సత్యరాజ్, ప్రస్తుతం పలు వైవిధ్యమైన చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలరిస్తున్నారు. త్వరలో ఆయన ప్రముఖ ఆవిష్కర్త జీడీ నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ 'జీడీఎన్'లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో జీడీ నాయుడు పాత్రలో ఆర్. మాధవన్ నటిస్తుండగా, దుషారా విజయన్ కథానాయికగా నటిస్తున్నారు. కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
సినిమా ప్రమోషన్స్లో భాగంగా జరిగిన ప్రెస్మీట్లో సత్యరాజ్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తాను కోయంబత్తూరులో పుట్టి పెరిగినా, ఇప్పటివరకు అక్కడ ఉన్న జీడీ నాయుడు మ్యూజియంను సందర్శించలేకపోయానని బాధ వ్యక్తం చేశారు. జీడీ నాయుడు చేసిన గొప్ప ఆవిష్కరణలను ప్రపంచం గుర్తించి గౌరవించాలని, అవి థామస్ అల్వా ఎడిసన్ ఆవిష్కరణల స్థాయిలో ఉన్నాయని తెలిపారు. సినిమాలో జీడీ నాయుడు చివరి రోజుల రూపాన్ని చూపించేందుకు చేసిన మేకప్, తనను ఎంతో ఆశ్చర్యపరిచిందని సత్యరాజ్ వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!