
సినిమాలు

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 చిత్రానికి హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. జూన్ 19న విడుదల కానున్న ఈ సినిమా గురించి వస్తున్న రూమర్స్పై కృతి స్పందించారు. ఈ చిత్రం లెస్బియన్ లవ్ స్టోరీ కాదని, ముగ్గురు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే ఎమోషనల్ డ్రామా అని స్పష్టం చేశారు.
ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతి రూమర్స్ను ఖండించగా, రష్మిక తమ మధ్య కెమిస్ట్రీ గురించి సరదాగా స్పందించారు. ప్రేక్షకులు థియేటర్లో చూసి ఆనందిస్తారని, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని సూచించారు. 2012లో విడుదలైన కాక్టెయిల్ చిత్రానికి ఇది సీక్వెల్. ఆ సినిమాలో దీపికా పదుకొణె, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ సీక్వెల్లో షాహిద్ కొత్త కోణంలో కనిపించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!