
రాజకీయాలు

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి కొనుగోళ్లు జరుగుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పూర్తి సహకారం అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి భారత ఆహార సంస్థకు హామీ ఇచ్చారు. ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ అనుజ్ త్యాగి, అధికారులు సోమవారం సచివాలయంలో మంత్రిని కలిసి ధాన్యం కొనుగోళ్లు, నిల్వ సదుపాయాలు, రవాణా అంశాలపై చర్చించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్ర పూల్ కోసం అందుబాటులో ఉన్న నిల్వ సామర్థ్యం 31 లక్షల టన్నులు మాత్రమే ఉందని అధికారులు తెలిపారు. ఎఫ్సీఐ ప్రమాణాల ప్రకారం రాష్ట్రానికి ఇంకా 16.25 లక్షల టన్నుల నిల్వ లోటు ఉందని, దీనిని అధిగమించేందుకు అదనపు గిడ్డంగుల నిర్మాణం అవసరమని వివరించారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!