
సినిమాలు

టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుతూ కాటేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్బికె111 దర్శకుడు గోపీచంద్ మాలినేని, ఎన్బికె హెల్పింగ్ హాండ్స్ అనంతపురం ప్రతినిధి జగన్, బాలకృష్ణ అభిమానులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
18 మంది వేద పండితుల సమక్షంలో మహా యాగంతో పాటు ధన్వంతరి హోమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పూజలు ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ఆలయ కమిటీ సభ్యుడు అర్జున్కు దర్శకుడు గోపీచంద్ మాలినేని కృతజ్ఞతలు తెలిపారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకుని మళ్లీ సినిమా షూటింగ్లలో పాల్గొనాలని అభిమానులు ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!