

పాన్ మసాలా ప్రకటనల్లో సెలబ్రిటీలు నటించడంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ తరహా ఉత్పత్తులను ప్రచారం చేసిన బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, సెలబ్రిటీల బాధ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమ అభిమానులకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రముఖులు ఇలాంటి ఉత్పత్తులకు ప్రచారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఓ పాడ్కాస్ట్లో సన్నీ డియోల్ తనకు పాన్ మసాలా ప్రకటనల ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించినట్లు తెలిపారు. తన మనస్సాక్షి అంగీకరించకపోవడంతో, తాను నమ్మని ఉత్పత్తులను ప్రచారం చేయలేనని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రకటనల్లో నటించబోనని చెప్పారు. గతంలో పాన్ మసాలా ప్రకటనలో నటించిన అక్షయ్ కుమార్ కూడా విమర్శల అనంతరం క్షమాపణలు చెప్పి ఆ ప్రకటన నుంచి వైదొలిగారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!