

జియా ఖాన్ మరణ కేసుపై మరోసారి స్పందించిన బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలి, ఈ కేసు చట్టపరంగా ఇప్పటికే ముగిసిపోయిందని స్పష్టం చేశారు. ఆగస్టు 2న ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న సుదీర్ఘ లేఖలో, 2023 ఏప్రిల్లో సీబీఐ ప్రత్యేక కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కోర్టు తీర్పు వచ్చినప్పటికీ ఇప్పటికీ సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం కావడం, ప్రజలు నిరాధార ఆరోపణలను నమ్మడం తనను తీవ్రంగా బాధిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ ఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని సూరజ్ తెలిపారు. సంఘటన జరిగినప్పుడు తన వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమేనని, జియా ఖాన్తో తన పరిచయం కూడా నాలుగు నెలలకే పరిమితమైందని చెప్పారు. దాదాపు 14 సంవత్సరాల పాటు కోర్టు కేసులు, ఆరోపణలు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నానని వెల్లడించారు. జియా ఖాన్ జ్ఞాపకాన్ని గౌరవించాలని, విషాదకర సంఘటనను సంచలనంగా మార్చకుండా కోర్టు రికార్డులు, వాస్తవాలను మాత్రమే నమ్మాలని ఆయన ప్రజలను కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!