

టాలీవుడ్ యువ నటుడు వరుణ్ తేజ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య లావణ్య త్రిపాఠితో ప్రేమ ఎలా మొదలై పెళ్లి వరకు చేరిందో ఆసక్తికరంగా వివరించారు. తనకు సరదాగా ఉండే వ్యక్తులు ఇష్టమని, లావణ్య కూడా అలాంటి స్వభావం కలిగిన అమ్మాయేనని చెప్పారు. మొదట మంచి స్నేహితులుగా మారిన తాము, క్రమంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమలో పడ్డామని వెల్లడించారు. దాదాపు ఐదేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి నిర్ణయం తీసుకుని, మొత్తం ఏడేళ్ల బంధం అనంతరం వివాహం చేసుకున్నామని తెలిపారు.
తన స్వభావం చాలా మౌనంగా ఉంటుందని, కానీ లావణ్య మాత్రం ఎప్పుడూ ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటుందని వరుణ్ చెప్పారు. అంతేకాదు, లావణ్య తన తల్లి, చెల్లితో ఎంతో సన్నిహితంగా కలిసిపోయిందని, ముగ్గురూ కలిసి గంటల తరబడి మాట్లాడుతుంటారని వెల్లడించారు. వారిమధ్య తాను చాలా నిశ్శబ్దంగా ఉంటానని, కొన్నిసార్లు వారి మాటలు తట్టుకోలేక సరదాగా చెవులు మూసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతానని చెప్పిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!