
జనరల్

తమిళ స్టార్ హీరో కార్తీ, దర్శకుడు మోహన్రాజా కాంబినేషన్లో తెరకెక్కనున్న 31వ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రంలో కార్తీ సరసన స్టార్ హీరోయిన్ త్రిష నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, హీరోయిన్ రేసులో నయనతార పేరు కూడా వినిపిస్తోంది. ‘తని ఒరువన్’ సినిమాలో మోహన్రాజాతో కలిసి పనిచేసిన హిప్హాప్ తమిళా ఆది ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ విలువలు, భావోద్వేగాలు, వినోదం ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!