

ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ఏకైక అజెండా అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. సుపరిపాలనే తమ మొదటి ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కలిదిండిలో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో రెవెన్యూ, భూ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు అధికారులు కష్టపడి పనిచేయాలని సూచించారు. భూ సమస్యలపైనే ఎక్కువ సంఖ్యలో ఆర్జీలు వచ్చాయని తెలిపారు.
పట్టాదారు పాస్ పుస్తకాలకు కరెన్సీ నోట్ల తరహాలో పటిష్టమైన భద్రతా ఫీచర్లను ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఆస్తుల వివరాలను ఎవరూ ట్యాంపర్ చేయకుండా బ్లాక్చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని, క్యూఆర్ కోడ్ సహా పలు సాంకేతిక భద్రతా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఇప్పటివరకు రైతులు, భూ యజమానులకు 32.32 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు అందించామని తెలిపారు. 9,365 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, మొత్తం 68.64 లక్షల పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!