

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతు మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ రుక్మిణి వసంత్ మాట్లాడుతూ.. మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు చూపించిన ప్రేమ, ఉత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్కు మంచి స్పందన లభించిందని, సినిమాలోని ప్రతి పాత్రకు దర్శకురాలు గీతు మోహన్దాస్ అద్భుతమైన క్యారెక్టరైజేషన్ అందించారని ప్రశంసించారు. టీజర్, ట్రైలర్లోనే సినిమాకు సంబంధించిన భారీ విజువల్స్ కనిపిస్తున్నాయని, పాత్రల మధ్య సంబంధాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసేలా ఉంటాయని చెప్పారు. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని రుక్మిణి పేర్కొన్నారు.
యశ్తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్న రుక్మిణి వసంత్.. ఆయనతో నటించడం తనకు బకెట్ లిస్ట్ మూమెంట్ అని, ఇది అద్భుతమైన అనుభవమని అన్నారు. కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా, నయన్, అక్షయ్, సుదేవ్ తదితరులతో కలిసి పనిచేయడం కూడా ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సినిమాకు సంగీతం అందించిన రవి బస్రూర్, విశాల్ మిశ్రాతో పాటు మొత్తం చిత్రబృందాన్ని ఆమె అభినందించారు. ఆగస్టు 26న తెలుగు సహా అన్ని భాషల్లో థియేటర్లలో విడుదల కానున్న ‘టాక్సిక్’ను ప్రేక్షకులు తప్పకుండా చూసి ఆదరించాలని రుక్మిణి కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!