

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన స్పోర్ట్స్ కామెడీ ఎంటర్టైనర్ ‘గట్టా కుస్తీ 2’ థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ‘గట్టా కుస్తీ’ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. ఈ నెల 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రంలో రమ్యకృష్ణన్, యోగిబాబు, కరుణాస్ కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.
మొదటి భాగం తరహాలోనే ఈ సినిమాలో కూడా భార్యాభర్తల మధ్య సరదా సంఘటనలు, కుస్తీ నేపథ్యంలో సాగే ఆసక్తికర సన్నివేశాలు, కుటుంబ భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టడంతో పాటు హీరో విష్ణు విశాల్కు మరో విజయాన్ని అందించింది.
థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకోగా, ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా అందుబాటులోకి రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!