

వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేశ్ మండపాలను దర్శించుకునే భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు ఈ నెల 14 నుంచి 24 వరకు అందుబాటులో ఉంటాయి. జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా నడిచే ఈ సర్వీసులు ప్యాట్నీ, ట్యాంక్బండ్, ఐమ్యాక్స్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, అఫ్జల్గంజ్, బాలాపూర్ ఎక్స్రోడ్ తదితర ప్రాంతాల మీదుగా సాగుతాయి.
జేబీఎస్ నుంచి ఉదయం 6 గంటలకు తొలి బస్సు ప్రారంభమై రాత్రి 9:55 గంటల వరకు ప్రతి 40 నుంచి 50 నిమిషాల వ్యవధిలో నడుస్తుంది. బాలాపూర్ గణేశ్ మండపం నుంచి తిరుగు ప్రయాణ బస్సులు ఉదయం 7:55 గంటలకు ప్రారంభమై రాత్రి 11:50 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీజీఎస్ఆర్టీసీ వీసీ, ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!