

22ఏ భూముల అంశాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ ఆరోపణలపై పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రజల భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, అసత్య ప్రచారాలతో తనను, ప్రభుత్వాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజాధనంతో ఏళ్ల తరబడి అధికారాన్ని అనుభవించి, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనవారే రాజీనామా చేయాలని అన్నారు. తాను ప్రతి నెల కేవలం ఒక్క రూపాయి జీతం తీసుకుంటూ, పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ టవర్ల నిర్మాణంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు.
ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రూ.21 కోట్లు పొంది అసెంబ్లీకి, ప్రజలకు దూరంగా ఉన్న మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావు రాజీనామా చేయాలా అని మంత్రి పొంగులేటి, హరీశ్ రావును ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. తన పేరును ప్రస్తావిస్తూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, గోదావరి, కృష్ణా నదులు ఉగ్రరూపంలో పొంగితే తామే కాదు, వారి పార్టీ కూడా రాజకీయంగా కనుమరుగవుతుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇందిరమ్మ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!