

థ్రిల్లర్ వెబ్ సిరీస్లను ఇష్టపడే ప్రేక్షకుల కోసం వదంది: ది మిస్టరీ ఆఫ్ మణి సీజన్ 2 ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో శశికుమార్ ప్రధాన పాత్రలో నటించగా, అపర్ణా దాస్, అనఘ, వివేక్ ప్రసన్న ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సిరీస్కు ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహించగా, పుష్కర్–గాయత్రి నిర్మించారు. ఆసక్తికరమైన కథనంతో ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
కథ ప్రకారం ప్రభుత్వం హైవే నిర్మాణ పనులు ప్రారంభించగా, శంకుస్థాపన రోజే రెండు అస్తిపంజరాలు బయటపడతాయి. ఈ కేసు శశికుమార్ పాత్రకు అప్పగించబడుతుంది. ఆ అస్తిపంజరాలు ఎవరివి? హత్య చేసినవారు ఎవరు? ఎందుకు చంపారు? అనే ప్రశ్నలతో కథ ముందుకు సాగుతుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో, ఒక్కోటి సుమారు 40 నిమిషాల నిడివితో సాగే ఈ వెబ్ సిరీస్ గ్రిప్పింగ్ స్క్రీన్ప్లేతో ఆకట్టుకుంటుంది. క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఇది మంచి ఎంపిక.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!