

భారతీయ సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైన థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో ఒకటైన ‘దృశ్యం’ సిరీస్ మూడో భాగం ‘దృశ్యం 3’ జూన్ 18 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆంథోనీ పెరుంబవూర్ నిర్మించగా, మోహన్లాల్, మీనా, సిద్ధిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన అనంతరం ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
‘దృశ్యం 2’ ఘటనల తర్వాత జార్జ్కుట్టి తన కుటుంబానికి సురక్షితమైన జీవితాన్ని నిర్మించుకున్నట్లు కనిపించినా, గతం మళ్లీ అతడిని వెంటాడుతుంది. అతను నిర్మించిన సినిమా వెనుక ఉన్న నిజాలను వెలికితీయడానికి ఇద్దరు జర్నలిస్టులు ప్రయత్నించడంతో పరిస్థితులు సంక్లిష్టంగా మారతాయి. ఇదే సమయంలో కుమార్తె అంజూకు వచ్చిన వివాహ ప్రతిపాదన కొత్త ప్రమాదాలకు దారి తీస్తుంది. పాత శత్రువులు తిరిగి రంగంలోకి దిగడంతో జార్జ్కుట్టి మరోసారి తన కుటుంబాన్ని రక్షించేందుకు పోరాడాల్సి వస్తుంది. సస్పెన్స్, భావోద్వేగాలు, ఉత్కంఠభరిత మలుపులతో ఈ చిత్రం ప్రేక్షకులకు మరపురాని థ్రిల్లర్ అనుభూతిని అందించనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!