
సినిమాలు

అథర్వా, ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఇదయం మురళి’ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. తెలుగులో ‘హృదయం మురళి’ పేరుతో విడుదలైన ఈ సినిమా కథ, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఆగస్టు 7 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆకాశ్ బాస్కరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్, ఎస్.ఎస్ థమన్, నిహారిక ఎన్ఎం, ద్రవిడ్ సెల్వం ముఖ్య పాత్రల్లో నటించారు. థమన్ సంగీతాన్ని అందించడమే కాకుండా కీలక పాత్రలో కూడా కనిపించారు. డాన్ పిక్చర్స్ బ్యానర్పై ఈ చిత్రం నిర్మించబడింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!