

హైదరాబాద్లో బోనాల ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు మైనారిటీ సంతుష్టీకరణ విధానాలను అవలంబిస్తున్నాయని ఆరోపించారు. బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించినప్పటికీ ఉత్సవాలకు తగినన్ని నిధులు, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ప్రశ్నించారు. అలాగే నిరుద్యోగం, ఫీజు రీయింబర్స్మెంట్, పెన్షన్లు, ప్రభుత్వ హామీల అమలుపైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో ఎందుకు చేర్చలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. అయోధ్య రామాలయ నిర్మాణంపై కాంగ్రెస్ నేతల గత వైఖరిని కూడా ఆయన విమర్శించారు. హిందూ సమాజం, సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలపై బీజేపీ ప్రశ్నిస్తూనే ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితికి ఉదాహరణగా హైడ్రా 150 పోస్టులకు నిర్వహించిన ఫిజికల్ టెస్ట్కు భారీగా అభ్యర్థులు హాజరైన విషయాన్ని ప్రస్తావించారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు రూ.4 వేల భృతి వంటి హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!