
క్రీడలు

విశాఖపట్నంలో నేడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో నిర్వహించే ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జ్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులకు నితిన్ నబీన్ దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలపై నేతలతో చర్చించనున్నారు. సాయంత్రం జెన్జీ యువతతో ‘యువ సంవాద్’ కార్యక్రమంలో నితిన్ నబీన్ ముఖాముఖి కానున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!