
క్రీడలు

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ జోక్యంతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) విధుల్లో పాల్గొంటున్న మహిళా బూత్ లెవల్ అధికారుల (బీఎల్వోలు)పై జరిగిన దాడి ఘటనను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) అత్యంత అత్యవసరంగా పరిగణించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ), అలాగే తెలంగాణ డీజీపీకి ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని సీఈఓ ఆదేశించారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఉద్యోగుల భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కమిషన్ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!