

జన్వాడ ఫామ్హౌజ్ భూమి తనదేనని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆ ఆస్తితో ఎలాంటి యాజమాన్య సంబంధం లేదని యజమాని బి. ప్రదీప్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలోని ఫామ్హౌజ్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫామ్హౌజ్ కేటీఆర్దంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. తాను 2019లో నాలుగెకరాల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, సుమారు ఏడేళ్ల క్రితం తన చిన్ననాటి స్నేహితుడైన కేటీఆర్కు ఆ భూమిని లీజుకు ఇచ్చానని తెలిపారు.
తన భూమికి క్లియర్ టైటిల్ ఉందని ప్రదీప్రెడ్డి చెప్పారు. ప్రభుత్వానికి లేదా సంబంధిత అధికారులకు భూమిపై ఏవైనా అనుమానాలు ఉంటే తనకు నోటీసులు ఇచ్చి పత్రాలు కోరవచ్చని, వాటిని చూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తన ఆస్తి వద్దకు వస్తామని కొందరు రాజకీయ నాయకులు చేసిన ప్రకటనలను మీడియాలో చూశానని తెలిపారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తన భూమిలోకి వస్తే కేసులు పెట్టేందుకు వెనుకాడబోనని హెచ్చరించారు. రాజకీయ కారణాలతోనే తన ఆస్తిని వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించిన ఆయన.. కేటీఆర్తో తనకు ఆస్తికి సంబంధించి ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని మరోసారి స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!