

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకు బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీర్లను “క్రిమినల్ వేస్ట్”గా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రపంచ స్థాయిలో భారత ఇంజనీర్లు కంపెనీలను నడుపుతూ, అంతరిక్ష రంగంలో విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం అవమానకరమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి కృషి చేస్తున్న ఇంజనీర్లను అవమానించడం అసహ్యకరమని విమర్శించారు.
ఈ అంశంపై స్పందించడం రాహుల్ గాంధీకి నైతిక, రాజకీయ బాధ్యత అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన మౌనం కొనసాగితే అది వ్యాఖ్యలను సమర్థించినట్లేనని అన్నారు. విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని, అలాగే ముఖ్యమంత్రి కూడా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యువతే దేశ భవిష్యత్తు అని గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తూ, తెలంగాణ యువత ఈ వ్యాఖ్యలను గమనిస్తూ సరైన సమయంలో సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!