

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపించిందని పేర్కొన్నారు. ఎక్స్లో చేసిన పోస్టులో ఆయన మాట్లాడుతూ, రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువకు మళ్లీ జీవం పోసి, రాంపూర్ మరియు రాజేశ్వరరావుపేట పంప్ హౌస్ల నుంచి నీటిని ఎత్తిపోస్తూ సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఎన్ని విమర్శలు చేసినా, కాళేశ్వరం నీటితో లబ్ధి పొందుతున్న రైతులకు వాస్తవాలు తెలుసని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
మరో పోస్టులో భారతదేశపు తొలి స్వదేశీ 350 కేజీ థ్రస్ట్ క్లాస్ టర్బోజెట్ ఇంజిన్ డెలివరీ పూర్తవడాన్ని కేటీఆర్ చారిత్రక విజయంగా అభివర్ణించారు. హైదరాబాద్కు చెందిన ఆజాద్ ఇంజినీరింగ్ మరియు డీఆర్డీవో సంయుక్త కృషితో ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు బలాన్నిస్తుందని, హైదరాబాద్ ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ హబ్గా ఎదుగుతున్నదానికి మరో నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!