
జనరల్

జనన–మరణాల రిజిస్ట్రేషన్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ (సవరణ) బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. సభలో విపక్ష సభ్యుల నినాదాలు కొనసాగుతున్నప్పటికీ, బిల్లును కొద్ది నిమిషాల్లోనే వాయిస్ ఓట్ ద్వారా ఆమోదించారు.
బిల్లుపై ఆమోదం అనంతరం లోక్సభ కార్యకలాపాలను స్పీకర్ ఆగస్టు 3 వరకు వాయిదా వేశారు. జనన, మరణాల నమోదును మరింత పారదర్శకంగా, ఆధునిక విధానంలో నిర్వహించేందుకు ఈ సవరణలు ఉపయోగపడతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు, విపక్షాలు బిల్లుపై విస్తృత చర్చకు అవకాశం ఇవ్వలేదని అభ్యంతరం వ్యక్తం చేశాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!