
రాజకీయాలు

వర్షాల కారణంగా మంగళవారం మధిర నియోజకవర్గంలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పంపిణీ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రేపు సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదికలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల రైతులు తమ తమ రైతు వేదికల నుంచి వర్చువల్గా పాల్గొంటారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే ప్రక్రియను వేగవంతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!