
రాజకీయాలు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కొత్త మూడు భాషల విధానం అమలుకు సంబంధించి తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్తించవని బోర్డు స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం 7, 8, 9వ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతిలో మూడో భాషకు ప్రత్యేక బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం లేదని తెలిపింది.
రెండు విదేశీ భాషలను అభ్యసిస్తున్న విద్యార్థులు తప్పనిసరిగా ఒక భారతీయ భాషను కూడా నేర్చుకోవాల్సి ఉంటుందని సీబీఎస్ఈ పేర్కొంది. కొత్త భాషా విధానానికి అనుగుణంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం నవీకరించిన అధ్యయన సామగ్రిని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు బోర్డు వెల్లడించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!