
జనరల్

ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం తెలంగాణలో దాఖలైన ఓ పిటిషన్తో ముడిపడి ఉంది. ఆ కేసులో ఆమెపై నేర ఆరోపణలు కాకుండా కేవలం సమన్లు మాత్రమే జారీ అయ్యాయి.
నారాయణపేట కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్రెడ్డిపై వచ్చిన లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసు నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఎ. శ్రీలత అనే మహిళ కోర్టును ఆశ్రయించారు. మీనాక్షీ నటరాజన్ సహా అనేక మందికి సమన్లు జారీ అయ్యాయి. ఇదే సమయంలో ఈ కేసు వివరాలు నామినేషన్లో పేర్కొనలేదనే కారణంతో ఎన్నికల సంఘం ఆమె రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!