

లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద చేపట్టిన నిరసనను విరమించారు. జంతర్ మంతర్ వద్ద గత నెల జరిగిన విద్యార్థుల నిరసన సందర్భంగా 19 ఏళ్ల లోచవ్ గాయపడిన ఘటనపై ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 118, 125 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అంతకుముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలతో కలిసి లోచవ్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఫిర్యాదు స్వీకరించే వరకు అక్కడే ఉంటానంటూ ఆయన నిరసన చేపట్టారు. లోచవ్ శరీరంలో పెల్లెట్ గన్ గాయాలున్నాయని, లోహపు గుళ్ల ముక్కలు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. అనంతరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో రాహుల్, ప్రియాంకతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు నిరసనను విరమించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!