

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప జగన్కు మరో పని లేదని ఆరోపించారు. గత రెండున్నరేళ్లలో అనేక అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ, ఒక్కసారి కూడా సభకు హాజరై ప్రజా సమస్యలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం పర్యటించిన రామ్మోహన్ నాయుడు పలు కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు.
జగన్ రాజకీయ ప్రయోజనాల కోసమే కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఆయన చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 16 వేల మంది టీచర్లకు ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. ఏడాది తర్వాత డీఎస్సీ, మంత్రి నారా లోకేశ్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని జగన్పై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!