

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు దాటినా ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు సహా ప్రధాన హామీలన్నింటినీ అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అయితే వెయ్యి రోజులు పూర్తయినా వాటి అమలులో ఆశించిన పురోగతి కనిపించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలపై సమగ్ర పోరుబాటకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు శుక్రవారం కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. నిరసన కార్యక్రమాలను పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ముందుండి నడిపించాలని ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో వినూత్న రీతిలో కార్యక్రమాలు నిర్వహించాలని, తెలంగాణ భవన్ నుంచి ఈ నిరసనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమన్వయం చేస్తామని కేటీఆర్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!