

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ముగించకపోవడం (ప్రోరోగ్ చేయకపోవడం) వెనుక పెద్ద వ్యూహామే ఉందనే చర్చ నడుస్తోంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. మరోవైపు, డీలిమిటేషన్పై ప్రభుత్వానికి ఉన్న ప్రణాళిలను ప్రతిపక్షాలతో పంచుకోవాలని, మరో 25 ఏళ్లపాటు లోక్సభ సీట్లను పెంచవద్దని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే గురువారం ఒక లేఖ రాశారు.
తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఆమ్ ఆద్మీ పార్టీలలో జరిగిన వరుస ఫిరాయింపుల నేపథ్యంలో, వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును తిరిగి ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తుందని ఊహాగానాలు వచ్చాయి. కానీ, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంతో వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరిగింది. అయినప్పటికీ, డీలిమిటేషన్ బిల్లు కోసం కసరత్తును కేంద్రం ఆపలేదని, పూర్తి మెజారిటీని సాధించేందుకు పావులు కదుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కిరెణ్ రిజిజు వ్యాఖ్యలు, మోదీకి ఖర్గే లేఖ రాయడం.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!