

పాలనలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై నిర్వహించిన సమీక్షలో ఉద్యోగుల వివరాలు, జీతాలు, బ్యాంకు ఖాతాలు, సంక్షేమ పథకాల సమాచారాన్ని డిజిటలైజ్ చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ప్రభుత్వం చెల్లింపులు చేసినప్పటికీ ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్, జీతాలు చెల్లించని ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి 100 రోజుల్లో నివేదిక సమర్పించేలా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులు, ఇతర ప్రయోజనాల అమలుకు కూడా పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేపట్టి, ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!