

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సంబంధించిన కోల్ బ్లాక్ కేటాయింపు కేసును సుప్రీంకోర్టు ముగించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత సోనియా గాంధీ స్పందించారు. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టులను సుప్రీంకోర్టు ఆమోదించి, 2015లో మన్మోహన్ సింగ్ను విచారణకు పిలుస్తూ దిగువ కోర్టు జారీ చేసిన సమన్లను పక్కన పెట్టింది. దీంతో ఆయనపై కొనసాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్కు ముగింపు లభించింది.
ఈ తీర్పుపై స్పందించిన సోనియా గాంధీ.. మన్మోహన్ సింగ్ను అత్యంత ప్రభావవంతమైన, నిజాయతీ గల ప్రధానిగా చరిత్ర గుర్తుంచుకుంటుందని అన్నారు. ఆయన నైతికత, జవాబుదారీతనం, మృదుస్వభావాన్ని ప్రశంసించారు. మన్మోహన్ సింగ్ను దోషిగా నిలబెట్టేందుకు సాగిన ప్రయత్నాలకు ఈ పరిణామంతో ముగింపు పడిందని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా కొనసాగిన ఈ వ్యవహారం ఆయన ప్రతిష్ఠపై ప్రభావం చూపేలా సాగిందని, తాజా తీర్పు ఆయన రికార్డుపై స్పష్టత తీసుకొచ్చిందని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!